భారతదేశంలో వరిపై ఆశించే తెగుళ్లు: గోధుమరంగు సుడిదోమ నియంత్రణ యొక్క ప్రాముఖ్యత
ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మందికి వరి అన్నం ప్రధానమైన ఆహారం. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా వున్న జనాభాలో 50% మంది వారి రోజువారీగా తీసుకునే కేలరీలను వరి బియ్యం మరియు దాని ఉత్పత్తుల నుండి పొందుతారు. అంతేగాకుండా, వరి సాగు మిలియన్ల మందికి ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచంలో అత్యధికంగా బియ్యం మరియు ముడి బియ్యం ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఒకటి. 2019 లో హెక్టారుకు 2665 కిలోల ఉత్పాదకతతో 43 మిలియన్ హెక్టార్లలో వరిని పండించారు. *
భారతదేశంలో వరిని సాగుచేసే రైతులు వివిధ పంట దశలలో వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు. ఈ సమస్యలు ఎక్కువగా వరిపై ఆశించే క్రిమికీటకాల తెగుళ్ళకు సంబంధించినవి. ఇవి పంటలపై దాడి చేసి, గణనీయమైన...
వరిపై ఆశించే తెగుళ్లు అన్నింటిలోనూ, భారతదేశంలో అన్నిప్రాంతాల రైతులు ఎదుర్కొనే ప్రధాన ముప్పులలో గోధుమరంగు సుడిదోమ ఒకటి. ఒకసారి అది వరి పైరుపై దాడిచేసిన తరువాత, పట్టిన తెగులు లక్షణాలు అత్యంత వినాశకరమైనవి మరియు అరికట్టేందుకు సరియైన చర్యలు చేపట్టకపోతే, వరిపై ఆశించే అగ్గితెగులు ఫలితంగా గణనీయమైన ఆర్థిక నష్టాలు రావచ్చు.
విజయవంతమైన గోధుమరంగు సుడిదోమ నియంత్రణ అనేది కీటకాల జీవశాస్త్రం, జీవితచక్రం మరియు మొక్కపై అది చూపే ప్రభావం గురించిన క్షుణ్ణమైన అవగాహనతో ప్రారంభమవుతుంది.
గోధుమరంగు సుడిదోమ జీవశాస్త్రం మరియు జీవిత చక్రం
పైరు పూతదశ నుండి పుష్పించే దశ వరకు గోధుమరంగు సుడిదోమ దాడి చేసే అవకాశం అత్యధికంగా వుంటుంది. ఆడదోమలు ఆకు మధ్య ఈనెలో ముద్దగా గ్రుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి, ముద్దకు 2 నుండి 11 గ్రుడ్ల మధ్యలో పెడతాయి. గ్రుడ్లు స్థూపాకారంగా ఉంటాయి, కొద్దిగా వంపుతిరిగి వుంటాయి మరియు పొడవు 1 మి.మీ మాత్రమే వుంటుంది. మొదట, అవి తెల్లగా ఉంటాయి మరియు అవి పొదగబడే స్థితిలో ముదురురంగుకు మారతాయి, దానిపై రెండు మచ్చలు వుంటాయి, అవి పిల్లపురుగు కళ్లు.
పొదిగే కాలం 4 నుండి 8 రోజులవరకు వుంటుంది. మొదట, పిల్లపురుగులు లేత గోధుమరంగు చాయలో వెన్నలాంటి తెలుపురంగులో వుంటాయి. తరువాత ముదురు గోధుమరంగులోకి మారతాయి. పుట్టిన వెంటనే పిల్లపురుగులు లేత ఆకులను ఆహారంగా తీసుకోవడం మొదలుపెడతాయి. 4 నుండి 5 సార్లు శరీరం పైపొర విడిచిన తరువాత, 2 నుండి 3 వారాలకు అవి పెద్దవి అవుతాయి. పెద్దదోమలు గోధుమరంగు- నలుపు కలిసిన చాయలో పసుపుపచ్చ-గోధుమరంగులో వుండే శరీరాన్ని కలిగివుంటాయి, ఇవి పొడుగు రెక్కలు మరియ పొట్టి రెక్కలు కలిగిన రెండు రూపాలలో వుంటాయి.
వీటి జీవితచక్రం జూన్ నుండి అక్డోబర్ మధ్యలోనైతే 18 నుండి 24 రోజుల కాలవ్యవధిలో, నవంబర్ నుండి జనవరి మధ్యలోనైతే 38 నుండి 44 రోజులలో, మరియు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలోనైతే...
గోధుమరంగు సుడిదోమ ప్రభావం
పిల్లపురుగులు మరియు పెద్దపురుగులు రెండూ కూడా ఆకుల పోషక కణజాలాన్నుండి రసాన్ని పీల్చి వరి పైరులకు నష్టం కలగజేస్తాయి, దీనివల్ల ఆకులు పసుపుపచ్చగా మారతాయి. తెగులు తీవ్రంగా ఆశించడం వల్ల మొక్కలు ఎండిపోయి, కాలిపోయినట్లుగా కనిపిస్తాయి. అందుకే దీనిని ‘హాపర్ బర్న్’ అని పిలుస్తారు. ఇది వలయాకారంగా వుండే పసుపు మచ్చలాగా వుంటుంది. ఇది గోధుమ రంగులోకి కూడా మారవచ్చు.
అధిక తేమ, తగినంత ఉష్ణోగ్రత, అధిక నత్రజని ఎరువుల వాడకం, గాలి లేని అనుకూలమైన పరిస్థితులలో గోధుమరంగు సుడిదోమ జనాభా అతివేగంగా పెరుగుతుంది. ఐతే, తెగులు తక్కువగా ఆశించినప్పటికీ, పూతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా, మొక్కలో శక్తి క్షీణిస్తుంది, దాని ఎత్తు తగ్గిపోతుంది. దీనితోబాటుగా, ఈ...
గోధుమరంగు సుడిదోమను నియంత్రించడం ఎలా?
దాని జనాభా సాంద్రతను బట్టి, గోధుమరంగు సుడిదోమ గణనీయమైన పంట నష్టాలను కలిగించవచ్చు. అందుకే, సకాలంలో సుడిదోమను అరికట్టడం మరియు నియంత్రించడం చాలా ముఖ్యం.
వరిని ఆశించే కీటక తెగులు ఉనికిని గుర్తించడంలో ప్రారంభించాలి:
ఆకు మధ్య ఈనెలో లేదా ఆకు ముడతలో కొద్దిగా వంపుతిరిగివున్న తెల్లటి గ్రుడ్లు
తెల్లటి లేదా గోధుమరంగులో వుండే పిల్లపురుగులు
పూత మొదలును పెద్దపెరుగులు ఆహారంగా తినడం
గోధుమరంగు సుడిదోమ దాడిని గుర్తించే సాధారణ సంకేతాల కోసం కచ్చితంగా పొలంలో తనిఖీ చేయండి:
హాపర్ బర్న్, లేదా మొక్కలు పసుపుపచ్చ రంగు, గోధుమరంగులోకి మారడం లేదా ఎండిపోవడం
గ్రుడ్డుపెట్టినచోట పడిన గుర్తులవల్ల మొక్కలకు వచ్చే శిలీంధ్ర మరియు సూక్ష్మక్రిమి సంబంధిత తెగులు...
తొలిదశనుండే, అంటే విత్తే దశ నుండే ప్రారంభమయ్యే సరియైన వరి పైరు నిర్వహణా కార్యక్రమంతో, రైతులు క్లిష్టమైన ఎదుగుదల దశలో ఎదురయ్యే సవాళ్లను దాటవచ్చు మరియు పునరుత్పత్తి దశలో మెరుగైన గోధుమరంగు సుడిదోమ నియంత్రణను పొందవచ్చు.
నారుమడిని నీటితో నింపడాన్ని ఎంచుకోనట్లయితే మరియు గోధుమరంగు సుడిదోమల సంఖ్య తమ సహజ శత్రువుల కంటే మించిపోతే, అప్పుడు కీటకనాశనియే సరైన మార్గం.
సింజెంటా రైతులకు వరిపై ఆశించే కీటకాల తెగుళ్లపై అత్యంత శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన నియంత్రణను అందిస్తుంది, తద్వారా తక్షణ పంట సంరక్షణను అందిస్తుంది.
వరిలో గోధుమరంగు సుడిదోమ నియంత్రణ కొరకు ‘చెస్’ ను ఎందుకు ఎంచుకోవాలి?
Green and Healthy Crop
ఛెస్® అనేది పైరు నాణ్యతను పెంచేది, ఇది పైరుకు అద్భుతమైన సానుకూలత కలిగివుంటుంది మరియు